Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మాయ చేసావె సీక్వెల్‌లో ''మాధవన్''.. ఆ కాంబో మళ్లీ రిపీట్..?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:34 IST)
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్యింది. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమా యూత్ మధ్య మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ మూవీ సీక్వెల్‌లో మాధవన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని మాధవనే స్వయంగా ప్రకటించాడు.  అలాగే టివినో థామస్, పునీత్ రాజ్‌కుమార్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 
 
ఇకపోతే, గౌతమ్‌తో మాధవన్ 2001లో మిన్నలె(తెలుగులో చెలి) చిత్రానికి గానూ కలిసి పనిచేశారు. మళ్లీ గౌతమ్ మీనన్, మాధవన్ కాంబినేషన్ దాదాపు 17 సంవత్సరాల రిపీట్ అవుతోంది. మరి ఈ సినిమా తెలుగు సీక్వెల్‌ కోసం గౌతమ్ మీనన్ చైతూనే తీసుకుంటాడా? లేకుంటే వేరొక హీరోను ఎంచుకుంటాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments