Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తికేయ ఖాతాలో కొత్త రికార్డ్.. 72గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:56 IST)
యంగ్ హీరో కార్తికేయ ఖాతాలో కొత్త రికార్డ్ నమోదైంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. 
 
కార్తికేయ కెరీర్ లో మరో భారీ ప్లాప్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా'లో విడుదలైంది 'చావు కబురు చల్లగా'. అయితే సినిమా విడుదలకు ముందు ఓటిటి ప్రేక్షకుల కోసం కొంచం రీఎడిట్ చేశారట మేకర్స్. 
 
ఇక ఆహాలో ఈ చిత్రం విడుదలైన 72గంటల్లోనే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటిటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్‌గా విలక్షణ పాత్ర పోషించారు. మురళీ శర్మ, రావు రమేష్, ఆమని ముఖ్యపాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments