Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఇంట్లోని ఆడవారే నీ మొహంపై ఉమ్మేయాలి(వీడియో)

హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చేట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా..

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:58 IST)
హీరో సుధీర్ బాబు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విమర్శలు గుప్పించారు. సినీ హీరోయిన్లు పరుపులు మార్చినట్లు పురుషులను మార్చేస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లపై ఆయన క్షమాపణలు చెప్పినా.. విమర్శలు తగ్గట్లేదు. రాజా సింగ్‌పై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి, నిర్మాత తమ్మారెడ్డి చర్చా కార్యక్రమంలోనే ఏకిపారేశారు. ఆపై రాజా సింగ్ తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 
 
కానీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ వరసయ్యే సుధీర్ బాబు రాజా సింగ్‌పై ఫైర్ అయ్యారు. సినిమా జనంపై దురుసుగా మాట్లాడిన రాజా సింగ్ పట్ల ఘాటుగా విమర్శించారు. ట్విట్టర్లో రాజా సింగ్‌ను ఉద్దేశించి '' నీ ఇంట్లోని ఆడోళ్లే నీ మొహంపై ఉమ్మేయాలి'' అంటూ పోస్టు చేశారు.

ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హీరోయిన్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్‌‍లో బిజీగా వున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments