Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత"కోటి" వందనాలంటున్న 'జై లవ కుశ'

జూ.ఎన్టీఆర్ హీరోగా, త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం‌పై ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. పైగా, ఈ చిత్రంలో మూడు పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసినా అందులో 'జై' పా

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:36 IST)
జూ.ఎన్టీఆర్ హీరోగా, త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'జై లవ కుశ'. ఈ చిత్రం‌పై ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. పైగా, ఈ చిత్రంలో మూడు పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసినా అందులో 'జై' పాత్ర గురించే అంతా చర్చ. రెండు పాజిటివ్‌ పాత్రలతో ఓ నెగిటివ్‌ క్యారెక్టర్‌ను ఎలా తీర్చిదిద్దారో చూడాలనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోయింది. 
 
"అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు..., ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రె.. రె.. రెడీ" అంటూ నత్తితో జై పాత్రలో ఎన్టీఆర్‌ తనదైన శైలిలో పలికిన డైలాగ్‌లకు ప్రశంసలు కురిపిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది. తాజాగా కోటి వ్యూస్‌ను దాటేసింది. 
 
అతితక్కువ సమయంలో కోటి వ్యూస్‌ను తమ చిత్రం ట్రైలర్‌ సొంతం చేసుకుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. ''జై లవకుశ' ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. గతంలో చెప్పినట్లుగానే.. నా నటనతో మీ అందరూ (అభిమానులు) తృప్తి చెందే విధంగా కష్టపడతా' అని అన్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా, రాశీ ఖన్నా, నివేదా థామస్‌‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments