Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మహానటి’కి ఫిదా అయిపోయానంటున్న అతిలోక సుందరి కుమార్తె

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:13 IST)
తెలుగు తమిళ సినీ పరిశ్రమలలో తిరుగులేని బావుటా ఎగరవేసిన కీర్తి సురేష్ తన తొలి బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీర్తి సురేష్‌కు తాను ఫిదా అయిపోయానంటున్నారు అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. జాన్వి తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్న ఓ బయోపిక్‌లో కీర్తి.. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించనున్న విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా తనకు కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టమని వెల్లడించిన జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కీర్తి ఫొటోను పోస్ట్‌ చేసారు. ‘‘కీర్తీ.. ‘మహానటి’ సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుండి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగానూ, ఆత్రుతగానూ ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అమిత్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఉండబోతోందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments