Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువునష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

Webdunia
బుధవారం, 19 జులై 2023 (08:57 IST)
ఓ పరువునష్టం దావా కేసులో సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌లకు హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అలాగే, రూ.5 వేల అపరాధం కూడా విధించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
మెగాస్టార్ చిరంజీవి సొంతంగా హైదరాబాద్ నగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని గత 2011లో జీవిత, రాజశేఖర్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ దంపతులపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైనా, ట్రస్టుపైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా కోర్టుకు సమర్పించారు. 
 
దీనిపై సుధీర్ఘకాలంగా విచారణ జరిగిన తర్వాత మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరికీ యేడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, అపుడే జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరికి తాత్కాలికంగా ఊరట కలిగించింది. ఈ దంపతులకు కోర్టు జైలు శిక్ష విధించడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments