Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు : కంగనా రనౌత్

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:56 IST)
హిందీ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి కంగనా రనౌత్‌కు, మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీకి మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బుధవారం హర్యానా రాష్ట్రం నుంచి ముంబైకి చేరుకునే లోపే మహారాష్ట్ర సర్కారు ఒత్తిడిమేరకు బీఎంసీ అధికారులు మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ చర్యపై కంగనా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆ తర్వాత శివసేనపై, ఉద్ధవ్‌ ఠాక్రేలపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. 
 
గురువారం కూడా మరోమారు సీఎం ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని కంగనా విమర్శల తూటాలు పేల్చారు. 'మీ తండ్రి చేసిన మంచి పనులు మీకు సంపదనిచ్చాయి.. కానీ మీ గౌరవం మీరే సంపాదించుకోవాలి. మీరు నా నోరు మూయించగలరు, కానీ నా గొంతు వంద మిలియన్లలో ప్రతిధ్వనిస్తుంది. ఎంత మంది నోర్లు మీరు మూయించగలరు? ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు? మీరు ఎప్పుడైతే నిజం నుంచి తప్పించుకోవాలని చూస్తారో.. మీరు రాజవంశానికి నమూనాగా మిగిలిపోతారు తప్ప ఇంకేమీ కారు' అని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కంగనా ట్వీట్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments