Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనికాకు నాలుగోసారి పాజిటివ్... ఆందోళనలో ఫ్యామిలీ మెంబర్స్

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:07 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడినవారిలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆమెకు నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ నాలుగుసార్లూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెను ఇంటికి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆమె కుటుబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా గాయని కనికా కపూర్‌కు నాలుగోసారి రక్తపరీక్షలు నిర్వహించారు. ఇందులో కూడా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. 
 
తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది. వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
 
కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20వ తేదీన కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments