Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జెర్సీ''పై కన్నేసిన కబీర్ సింగ్.. సీన్‌లోకి కరణ్ జోహార్..!?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (12:41 IST)
బాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లో భారీగానే వసూళ్లు చేస్తోంది. ఈ సినిమా తెలుగులో విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. 
 
హిందీలో ఈ సినిమాకు కాస్త యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.71 కోట్లు వ‌సూలు చేసింది. అది కూడా భారత్‌లో మాత్రమే. ఓవర్సీస్‌ల్లో కలుపుకుంటే.. రూ.90కోట్లకు పైగా వుంది.
 
ఈ నేపథ్యంలో కబీర్ సింగ్ మరో తెలుగు సినిమాకు రీమేక్ చేయనున్నాడు. నేచురల్‌ స్టార్ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌ సాధించినా వసూళ్ల పరంగా వెనకపడింది. 
 
అయితే నాని నటన, గౌతమ్‌ టేకింగ్‌ మాత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కన్నుపడింది. ఇప్పటికే కరణ్‌ జెర్సీ రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
 
అంతేకాదు ఒరిజినల్‌ వర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే రీమేక్‌ను కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట కరణ్‌. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments