Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు 'మహానటి' విరాళం రూ. 10 లక్షలు

కేరళ వరద బాధితులకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకులతో మహానటిగా పిలిపించుకుంటున్న కీర్తి సురేష్ కూడా తనవంతు సహాయాన్ని అందించింది.

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (16:19 IST)
కేరళ వరద బాధితులకు పలు సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకులతో మహానటిగా పిలిపించుకుంటున్న కీర్తి సురేష్ కూడా తనవంతు సహాయాన్ని అందించింది.
 
కీర్తి సురేష్ తనవంతు సహాయంగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. కానీ అంతటితో సంతృప్తి చెందకుండా మరో 5 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి బాధితులకు కావాల్సిన బట్టలు, మందులు, ఇతరత్రా సామాగ్రిని కొని తనే స్వయంగా వెళ్లి బాధితులకు వాటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. స్టార్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా కీర్తి సురేష్ ఇలా ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం మహానటి సావిత్రి ప్రభావమే అని అంటున్నారు తెలుగు ప్రజలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం