Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మహానటి’కి మరో చరిత్రాత్మక పాత్ర... అదేంటంటే?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:52 IST)
‘మహానటి’ సినిమాలో సావిత్రమ్మ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అన్నట్లు నటించి అందరి చేతా ప్రశంసలు అందుకున్న కీర్తిసురేష్‌కు మరో చారిత్రాత్మకమైన పాత్రను పోషించే అవకాశం వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో కుందవై నాచ్చియార్‌ పాత్రకు కీర్తి సురేష్‌ ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

ఎంజీఆర్‌ నుండి కమల్‌ హాసన్‌ వరకు పలువురు అగ్రహీరోలు ఈ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరింపజేయాలని ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మణిరత్నం కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. 
 
ఎట్టకేలకు ఈ ఏడాదిలోనే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు రూ.200 కోట్ల ఉండవచ్చునని సమాచారం. కోలీవుడ్‌ సమాచారం మేరకు అమితాబ్‌ బచ్చన్‌, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌, మోహన్‌బాబు, కీర్తి సురేష్‌లు ప్రధాన తారాగణంగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరి పూర్తి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో వేచి చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments