Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారాజుకు వీడ్కోలు - ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమ యాత్ర

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:01 IST)
పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు అంతిమ యాత్ర సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. 
 
దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు శాశ్వత విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడ ప్రభుత్వ అధికారక లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కనకమామిడి ఫాంహౌస్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్టులో కృష్ణంరాజు అంత్యక్రియలను పూర్తి చేస్తారు. ఈ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభిమానులతో పాటు మీడియాను కూడా రిసార్టులోనికి అనుమతించలేదు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments