Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (11:59 IST)
పలువురు అమ్మాయిలను వేధించడంతో పాటు వారిని నగ్నంగా వీడియోలు తీసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి వల్ల పవిత్రమైన దర్గాకు అపవిత్రత కలుగుతుందని నటి లావణ్య ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. లావణ్య తరపున ఆమె న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశార. మస్తాన్ సాయి వల్ల మస్తాన్ బాబా దర్గాకు అపవిత్రత కలుగుతోందని పేర్కొన్నారు. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని కోరారు. ఈ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. 
 
సినీ హీరో రాజ్ తరుణ్, నటి లావణ్యల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో దుమారం రేపిన విషయం తెల్సిందే. ఈ కేసులో మస్తాన్ సాయి నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే సాయిపై మహిళల న్యూడ్ ఫోటోలు తీయడం, అత్యాచారం, డ్రగ్స్ ఇలా అనేక రకాలైన కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో మస్తాన్ సాయిని అరెస్టు చేయగా, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివాదంలో చిక్కుకోవడంతో హీరో రాజ్ తరుణ్ సినీ కెరీర్ నాశనమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తలేని జీవితం.. ఇక జీవించడం కష్టం.. నదిలో బిడ్డల్ని పారవేసింది.. ఆపై ఆమె కూడా?

నారా చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రాజీవ్‌రెడ్డి అరెస్ట్

ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగిస్తే కరెంట్ ఆదా అవుతుందా?

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

బాలాపూర్‌లో దారుణ ఘటన: మెడికల్ డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments