Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుస్వర ప్రస్థానానికి ముగింపు పలికిన గాయని

గానకోకిలమ్మ ఎస్. జానకి ఇక పాడరు. మైసూరులో చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. తన సుస్వర ప్రస్థానానికి ఎక్కడైతే శ్రీకారం చుట్టారో అక్కడే ముగింపు పలకడం గమనార్హం.

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (09:32 IST)
గానకోకిలమ్మ ఎస్. జానకి ఇక పాడరు. మైసూరులో చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. తన సుస్వర ప్రస్థానానికి ఎక్కడైతే శ్రీకారం చుట్టారో అక్కడే ముగింపు పలకడం గమనార్హం. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్‌తో కలిసి జానకి 1952లో ఇక్కడి నుంచే పాటలను ఆలపించారు. 
 
పలు చిత్రాలకు నేపథ్యగానాన్ని అందించిన ఆమె గత కొంతకాలంగా వేదికలపై పాటల్ని పాడటాన్ని నిలిపివేసిన విషయం విదితమే. ఒక సంస్థకు విరాళాలను సమకూర్చేందుకు ఆమె రాచనగరి మైసూరులో శనివారం రాత్రి జరిగిన తన చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. 
 
తన సంగీత రవళులకు జన్మనిచ్చిన మైసూరులోనే ఈ ప్రస్థానానికి ముగింపు పలకడం ద్వారా ఈ పట్టణంపై మమకారాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. ఆమెకు వీరాభిమానులు ప్రవీణ్‌, పవన్‌, నవీన్‌ల విన్నపం మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు చివరిసారిగా ఈ వేదికపై పాడేందుకు ఆమె అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు. 
 
ఎక్కువ మంది సంగీతాభిమానులు తరలివచ్చి ప్రత్యక్షంగా ఆమె పాటలను విని పులకించారు. ఈ సందర్భంగా రాజవంశస్తురాలు ప్రమోదా దేవి ఒడయారు, అలనాటి నాయికలు జయంతి, భారతీ విష్ణువర్ధన్‌లు ఆమెను ఘనంగా ఈ సందర్భంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments