Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్‌కు ఊరట.. భవ్‌నిందర్‌ సింగ్‌కు ఉత్తర్వులు.. ఆ ఫోటోలు షేర్ చేయొద్దు..

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (18:08 IST)
హీరోయిన్ అమలాపాల్‌కు మద్రాసు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమె మాజీ ప్రియుడు, గాయకుడు భవ్‌నిందర్‌ సింగ్‌‌కు అమలాపాల్‌తో దిగిన వ్యక్తిగత ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇటీవల అమలాపాల్‌ భవ్‌నిందర్‌పై పరువునష్టం దావావేశారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని భవ్‌నిందర్‌ను ఆదేశించింది. డిసెంబరు 22కు కేసును వాయిదా వేసింది.
 
భవ్‌నిందర్‌ తమ వ్యక్తిగత చిత్రాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, వివాహం జరిగినట్లు చిత్రీకరిస్తున్నాడంటూ ఇటీవల అమలాపాల్‌ కోర్టును ఆశ్రయించారు. అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకున్నారని మార్చిలో వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన గాయకుడు భవ్‌నిందర్‌తో ఆమె పెళ్లి జరిగిందంటూ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీటిపై అమలాపాల్‌ స్పందిస్తూ.. వృత్తిపరమైన అవసరాల కోసం ఆ ఫొటోలు దిగామని, అది పెళ్లి కాదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments