న్యూలుక్‌లో మహేశ్ బాబు.. రాజమౌళి ప్రాజెక్టు కోసమేనా?

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (17:10 IST)
టాలీవుడ్ అగ్ర హీరో మహేశ్ బాబు దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రే
వంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ విరాళాన్ని మహేశ్ బాబు దంపతులు ఇచ్చారు. ఈ చెక్కును సోమవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్వయంగా అందజేశారు. 
 
అయితే, మహేశ్ బాబు కొత్త లుక్‌‍లో కనిపించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుంటా పోయాయి. మహేష్ న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ అలాంటి అనుభూతికే లోనవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో ఉన్నారు. 
 
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్ నేపథ్యంలో ఉంటుందని ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్రంలో మహేశ్ లుక్‌‍పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఫోటోలో లాంగ్ హెయిర్, గడ్డం, వైట్ ఫుల్‌హ్యాండ్ టీషర్టులో కనిపిస్తున్న మహేశ్ బాబును చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ హీరో రాజమౌళి సినిమాలో ఇదే లుక్‌లో కనిపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments