Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటలో మహేష్‌కి జోడీగా మహానటి.. (Video)

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:31 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట సినిమాతో మాస్ లుక్‌లో రాబోతున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ మేనేజర్ లుక్‌లో అతడు కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై ఈ సినిమా తీస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరో ఎవరు అనే సందిగ్ధత ఉండేది. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్ట్ చేసింది. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. తమ టీంలోకి ఆహ్వానిస్తూ పోస్టర్ విడుదల చేసింది.
 
సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత మహేష్ నటించబోయే ఈ సినిమాలో ఇటీవల వరకు కూడా కీర్తి సురేష్ హీరోయిన్ అనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. అదే నిజమై హీరోయిన్‌గా ప్రకటించారు. దీంతో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments