Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఎదుర్కోవాలంటే ముగ్గురు ముసుగు దొంగలు సరిపోరు.. నేను చాలా స్ట్రాంగ్: మల్లికా షెరావత్

ప్ర‌ముఖ బాలీవుడ్ భామ మ‌ల్లికా షెరావ‌త్‌పై గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు దాడి చేశారు. ప్యారిస్‌లోని తన ఫ్లాటుకు వెళ్తుండగా ముఖానికి ముసుగు ధ‌రించిన ముగ్గురు వ్యక్తులు హ‌ఠాత్తుగా ఆమెపై టియ‌ర్ గ్యాస

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (13:35 IST)
ప్ర‌ముఖ బాలీవుడ్ భామ మ‌ల్లికా షెరావ‌త్‌పై గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు దాడి చేశారు. ప్యారిస్‌లోని తన ఫ్లాటుకు వెళ్తుండగా ముఖానికి ముసుగు ధ‌రించిన ముగ్గురు వ్యక్తులు హ‌ఠాత్తుగా ఆమెపై టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించి మ‌ల్లికాతో పాటు మ‌రో వ్య‌క్తిపై దాడి చేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఈ ఘటనపై మల్లికా షెరావత్ స్పందించింది. తనను ఎదుర్కోవాలంటే ముగ్గురు దొంగలు కావాలంటోంది.  
 
తనపై దాడికి ముసుగు దొంగలు సరిపోరని.. తాను చాలా స్ట్రాంగ్‌ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా మల్లికా షెరావత్ వెల్లడిస్తూ ఫోటో పోస్ట్ చేసింది. మల్లిక ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి పారిస్‌లో ఉంటోంది. మల్లికా షెరావత్‌పై జరిగిన దాడికి ఆమె ప్రతిఘటించిందని తెలుస్తోంది. మల్లిక చేసిన పోస్ట్‌ ప్రకారం చూస్తే ముసుగు దొంగల దాడిని ఎదుర్కొని వారిపై ప్రతిదాడి చేసినట్లు తెలుస్తోందని విదేశీ మీడియా చెప్తోంది. 
 
కొద్ది రోజుల క్రితమే హాలీవుడ్‌ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌ను ఇద్దరు దొంగుల గన్‌తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు కిమ్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉంటున్న మల్లికపై ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments