Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులకు కారణం నేనే... నా భర్త చాలా మంచోడు... మనీషా కొయిరాలా... మాజీ భార్యలు ఎందుకిలా?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు చాలా మంచోళ్లని చెప్పుకోవడం ఎక్కువవుతోంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది ప్రక్కనబెడితే తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చేరిపోయింది. జెంటిల్మన్, ఒకే ఒక్క

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (16:42 IST)
ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు చాలా మంచోళ్లని చెప్పుకోవడం ఎక్కువవుతోంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది ప్రక్కనబెడితే తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చేరిపోయింది. జెంటిల్మన్, ఒకే ఒక్కడు, బొంబాయి వంటి హిట్ చిత్రాల్లో నటించి కుర్రకారును ఓ ఊపు ఊపిన మనీషా కొయిరాలా ప్రముఖ వ్యాపారవేత్త సమ్రాట్ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుంది. 
 
2010లో నేపాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడితో తన వైవాహిక బంధం సాగడం దుర్లభం అంటూ అతడిని విమర్శిస్తూ ఫేస్ బుక్‌లో పోస్టులు కూడా చేసింది. చివరికి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు క్యాన్సర్ బారిన పడి, ఆ జబ్బును జయించి బయటపడింది. 
 
ఐతే ఇప్పుడు ఆమె ఓ విషయాన్ని చెప్పింది. అదేమిటంటే... తన వైవాహిక బంధం విచ్ఛన్నం కావడానికి కారణం తనేనంటూ బయటపడింది. తప్పు చేసింది తనేనంటూ వెల్లడించింది. ఐతే నాలుగైదేళ్ల క్రితం వరకూ భర్తంటే కస్సుమనే మనీషా కొయిరాలా ఇప్పుడు ఇలా ఎందుకు చెపుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇకపోతే ఇటీవలే మరో బాలీవుడ్ కపుల్ హృతిక్ రోషన్-సుస్సాన్నే ఖాన్ విడిపోవడం, ఆ తర్వాత తన భర్త చాలా మంచివాడంటూ ఆమె కితాబివ్వడం తెలిసిందే. తన మాజీ భార్య కోసం హృతిక్ తన ఇంటి పక్కనే మరో ప్లాటు కొనివ్వడమూ తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్-రేణూ దేశాయ్ సంగతి గురించి వేరే చెప్పక్కర్లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments