Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి బాలీవుడ్‌కు ఎందుకు దూరంగా వున్నారు? మెగాస్టార్ ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:51 IST)
ముంబైలో గ్రాండ్‌గా జరిగిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్‌లో అక్కడి మీడియా టీమ్‌ను ప్రశ్నల వర్షంలో ముంచెత్తి కావలసిన సమాధానాలను రాబట్టుకుంది. ఈ సందర్భంగా, ప్రతినిధులు చిరుని ఇంత కాలం బాలీవుడ్‌కు దూరంగా ఎందుకు ఉన్నారు అని అడిగారు. వారు అడగడానికి కారణం లేకపోలేదు. చిరు చేసిన చివరి హిందీ స్ట్రెయిట్ మూవీ ది జెంటిల్ మెన్. ఇది 1994లో విడుదలైంది. 
 
అంతకు ముందు ఆజ్ కా గూండా రాజ్, ప్రతిబంద్‌లు కమర్షియల్ సూపర్ సక్సెస్‌ని అందుకుని కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. ఆ టైంలో చిరంజీవి ఇకపై రెగ్యులర్‌గా హిందీ సినిమాలు చేస్తారనే టాక్ కూడా పత్రికల్లో వచ్చేది. కానీ చిరు ఆ తర్వాత మళ్ళీ వాటి జోలికే వెళ్ళలేదు. అందుకే ఈ సందర్భాన్ని వాడుకుని జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడగగా, చిరు సమాధానం ఇచ్చారు. 
 
నిజానికి దానికి స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేదని, తెలుగు సినిమాల్లో విపరీతంగా బిజీ కావడం వల్ల ఆ తర్వాత రాజకీయాల్లో కొన్నేళ్లు గడపాల్సి రావడం వంటి కారణాల వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించే వ్యవధి లేకపోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్ కథ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments