Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సర్జా సతీమణికి రెండో పెళ్లి.. రాయన్ రాజ్ సర్జ అనే పేరు..?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (09:55 IST)
కన్నడ హీరో చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో కన్నుమూశాడు. చిరు మరణం తర్వాత ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లిపోయింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోడానికి.. చిరంజీవి లేడని అర్థం చేసుకోడానికి చాలా సమయం తీసుకున్నారు అభిమానులు.  
 
ఇకపోతే.. చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ విషయంలో ఎంతో కుంగిపోయారు. చిరంజీవి చనిపోయిన నాలుగు నెలల తర్వాత మేఘనకు అబ్బాయి పుట్టాడు. అతడిని మొన్నటి వరకు జూనియర్ చిరంజీవి సర్జ అని పిలిచేవారు. అయితే ఈ మధ్యే తమ వారసుడి పేరు అధికారికంగా ప్రకటించింది మేఘనా రాజ్. చిరు కొడుక్కి రాయన్ రాజ్ సర్జ అనే నామకరణం చేసారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరోవైపు చిరు మరణం తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉండిపోయింది మేఘన. ఇప్పుడు కొడుకుతో పాటు హాయిగా ఉంటుంది. పోయిన భర్తను కొడుకులో చూసుకుంటుంది ఈమె.  
 
అందుకే కీలక నిర్ణయం తీసుకుంది. చిరంజీవితో పెళ్లి తర్వాత సినిమాలకు పాక్షికంగా బ్రేక్ ఇచ్చింది మేఘన. అయితే ఇప్పుడు ఆయన చనిపోవడంతో కెరీర్‌పై మరోసారి ఫోకస్ చేసింది. వరుస సినిమాలు చేస్తే కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేనని ఫిక్స్ అయిపోయింది ఈమె.
 
ప్రస్తుతం మేఘన రాజ్ రెండు సినిమాలు చేస్తుంది. సెల్ఫీ మమ్మీ.. గూగుల్ డాడీ సినిమాతో పాటు బుద్ధిమంత 2లో నటిస్తుంది మేఘన. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.   
 
మేఘనకు కన్నడలో మంచి ఇమేజ్ ఉంది. అందుకే అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కానీ మేఘన సర్జా రెండో పెళ్లిపై ప్రస్తుతం వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై సీరియస్ అయింది మేఘనా రాజ్.
 
మరోవైపు బిగ్ బాస్ 1 కన్నడ విన్నర్‌తో ఈమె ఏడడుగులు నడవబోతుందనే ప్రచారం ఈ మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి నిజం లేదని.. లేనిపోని వార్తలు రాసి అనవసరంగా ప్రశాంతత చెడగొట్టొద్దని చెప్తున్నారు మేఘన రాజ్. తనకు అలాంటి ఉద్దేశాలు లేవని.. తన కొడుకు తనకు సర్వస్వం అంటోంది మేఘన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments