Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో నుంచి బీఎండబ్ల్యూ వరకు.. తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న సిరాజ్!

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (15:44 IST)
ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టులో ఓ సభ్యుడు మహ్మద్ సిరాజ్. హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రోడు... తండ్రిని కోల్పయిన దుఃఖంలోనూ మైదానంలో అమితంగా రాణించాడు. ఇపుడు ఈ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. ఈయన తండ్రి ఓ ఆటో డ్రైవర్. అయితే, ఇపుడు మహ్మద్ సిరాజ్ ఏకంగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఈ కారును తనకు తానే బహుమతిగా ఇచ్చుకున్నాడు. 
 
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకు బ్యాకప్​ బౌలర్​గా ఎంపికైన సిరాజ్.. ఆ దేశంలో ఉండగానే తన తండ్రి మరణ వార్తను విన్నాడు. క్వారంటైన్​లో ఉన్న అతడిని స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది. తాను దేశం తరపున ఆడాలనేది తండ్రి కల అని, దానిని నెరవేర్చిన తర్వాతే ఇంటికి వెళ్తానని బోర్డుకు తేల్చి చెప్పాడు. దానిని నిజం చేస్తూ టెస్టు సిరీస్​ను భారత్​ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.
 
తొలి టెస్టులో షమి గాయపడడం వల్లే సిరాజ్​కు జట్టులో చోటుదక్కింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఇతడు.. మెల్​బోర్న్​లో 5 వికెట్లు తీసి గెలుపులో సహాయపడ్డాడు. సిడ్నీ మ్యాచ్​లో ఆసీస్​ ప్రేక్షకుల నుంచి జాత్యాంహకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా సరే వాటిని తట్టుకుని నిలబడి, రెండు వికెట్లు తీశాడు. 
 
నిర్ణయాత్మక బ్రిస్బేన్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఒక వికెట్​.. రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు పడగొట్టి భారత్​కు మరపురాని విజయాన్ని అందించాడు. పర్యటన ముగించుకుని స్వదేశానికి రాగానే నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి భావోద్వేగానికి లోనయ్యాడు.
 
సిరాజ్​ తండ్రి హైదరాబాద్​లో ఓ ఆటో డ్రైవర్​. తన కొడుకు తనలా కాకుండా గొప్పగా బతకాలని ఆయన కలలు కన్నారు. సిరాజ్​ క్రికెట్​లో రాణించేందుకు ఆయన అహర్నిశలు శ్రమించారు. ఆసీస్ పర్యటనతో ఆయన కల నిజమైంది. 
 
ఇప్పుడు బీఎమ్​డబ్ల్యూ కారు కొన్న సిరాజ్.. దానిని తనకు కానుకగా ఇచ్చుకున్నాడు. ఆటోవాలా కుమారుడి స్థాయి నుంచి బీఎమ్​డబ్ల్యూ యజమాని వరకు సాగిన సిరాజ్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. నెటజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments