Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగింది.. హీరో బాలకృష్ణ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:55 IST)
హీరో నందమూరి తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందని నటుడు బాలకృష్ణ అన్నారు. నారా లోకేశ్ యువగళం యాత్రలో తీవ్ర అస్వస్థతకు లోనైన తారకరత్న ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, బాలకృష్ణలు ఆదివారం తన కుటుంబ సభ్యులతో ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను చూశారు. 
 
ఆ తర్వాత ఆస్పత్రి వద్ద బాలయ్య విలేకరులతో మాట్లాడుతూ, తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందన్నారు. తొలుత ఆయన గుండె ఆగిపోయిందని, ఆ తర్వాత తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరలోనే కోలుకుంటాడని చెప్పారు. మరింత పురోగతి కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం కుప్పం తీసుకొచ్చినపుడు ఉన్నట్టుగానే తారకరత్న ఆరోగ్య పసిస్థితి ఉందని ఆయన తెలిపారు. వైద్యులు అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. అంతర్గత రక్తస్రావం కారణంగా తారకరత్నకు స్టెంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments