Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ తరహాలోనే మోక్షజ్ఞ కూడా... వెండితెర ఎంట్రీ

వెండితెరపై వెలుగులు వెలిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుల వారసులైన బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు వారి వారసులు కొంతమంది

Webdunia
గురువారం, 19 జులై 2018 (11:15 IST)
వెండితెరపై వెలుగులు వెలిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుల వారసులైన బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు వారి వారసులు కొంతమంది ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా మరికొందరు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు.
 
అక్కినేని కుటుంబ కథా చిత్రం "మనం" సినిమా ద్వారా అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. 'మనం'లో గెస్ట్ రోల్ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 
 
ఇకపోతే, నందమూరి రెండోతరం వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమౌతున్నాడు. మూడేళ్ళ క్రితమే మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొద్దామని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. 
 
ఈ నేపథ్యంలో బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేద్దామని దర్శకుడు క్రిష్ కోరగా, అందుకు బాలయ్య అంగీకరించలేదు. ఇప్పుడు సమయం రావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు.  
 
నూనూగు మీసాల వయసులో నిమ్మకూరులో అల్లరి చిల్లరిగా తిరిగే ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో మోక్షజ్ఞ కనిపించబోతున్నట్టు సమాచారం. మోక్షజ్ఞ రోల్ 15 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. మరి యంగ్ ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments