Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

సెల్వి
గురువారం, 21 నవంబరు 2024 (18:26 IST)
నయనతార, ధనుష్‌ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ ధాన్ చిత్రంకు చెందిన బీటీఎస్ ఫుటేజీని ఉపయోగించడానికి ధనుష్ ఎన్ఓసీ ఇవ్వాలని డబ్బు డిమాండ్ చేశాడని నయనతార బహిరంగ లేఖ రాసింది. 
 
నయనతార తనపై బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ధనుష్ ఈ విషయంపై మౌనంగా ఉండిపోయాడు. ప్రస్తుతం నయన డాక్యుమెంటరీ విడుదలైంది. తాజాగా మరొక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది నయనతార.
 
ఆమె నటించిన వివిధ చిత్రాల నుండి ఫుటేజీని ఉపయోగించడానికి తనకు ఎన్ఓసీ ఇచ్చిన ప్రతి నిర్మాతకు ధన్యవాదాలు. లేఖలో, ఆమె షారూఖ్ ఖాన్, బాలచందర్ వంటి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయనిధి స్టాలిన్, కేఈ జ్ఞానవేల్ రాజా, ఏఆర్ మురుగదాస్, లైకా ప్రొడక్షన్స్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్‌లకు ధన్యాదాలు తెలిపింది.
 
మెగాస్టార్, మెగా పవర్ స్టార్ అంటూ చిరంజీవి, రామ్ చరణ్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సైరా నరసింహారెడ్డి ఫుటేజీని ఉపయోగించుకునేందుకు ఎన్‌ఓసీ ఇచ్చినందుకు మెగాస్టార్‌కు నయనతార  కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రెస్ నోట్ ద్వారా ఎన్ఓసీ ఇవ్వని ధనుష్‌ స్పందన కోసం నయనతార ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలపై రానున్న రోజుల్లో ధనుష్ స్పందిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments