Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ పెళ్లి కానుకగా విడుదల అయిన 'రంగ్ దే' దృశ్య మాలిక

Webdunia
సోమవారం, 27 జులై 2020 (17:40 IST)
యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్'ల తొలి కాంబినేషన్లో ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'. 'తొలిప్రేమ','మిస్టర్ మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభ గల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పి.డి.వి. ప్రసాద్ చిత్ర సమర్పకులు.

" పెళ్లికొడుకెక్కడ... 
హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్.. 
అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు.. 
అర్జున్.. ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ దృష్ట్యా 'అను'ని నువ్వు పెళ్లి చేసుకోవటమే నాకు న్యాయం అనిపిస్తోంది. 
చెయ్ తియ్ జస్టిస్ చౌదరి... 
ఏంటి మావయ్య.. నీ బతుకు ఇలా అయిపొయింది.
 
ఏరా...ఏడుస్తున్నావా.... మరి పెట్టు.. 
'నాన్నా.. నవ్వుతోంది... నేను కట్టలేను నాన్నా'
 అనే సందర్భానుసారంగా సాగే సంభాషణలతో పాటు
 'బస్టాండే బస్టాండే... ఇక బతుకే బస్టాండే అనే సాహిత్యంతో కూడిన బీజియంతో ఈ దృశ్య మాలిక ముగుస్తుంది. హీరో నితిన్ వివాహమహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం యూనిట్ ఈ దృశ్య మాలికను విడుదల చేసింది.
 
'ప్రేమ'తో కూడిన కుటుంబ కథా చిత్రం 'రంగ్ దే'. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2021 సంక్రాంతి  కానుకగా చిత్రం విడుదల అవుతుందన్నట్లుగా ఈ టీజర్లో కనిపిస్తుంది.
 
నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే: సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ , రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments