Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. హీరో ప్రభాస్‌కు ఊరట.. వందల ఎకరాల భూవివాదానికి ఫుల్ స్టాప్

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:04 IST)
హమ్మయ్య హీరో ప్రభాస్‌కు ఊరట లభించింది. వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా హైకోర్టు సూచనలు చేసింది. లీగల్ దస్తావేజుల ద్వారా ప్రభాస్ భూమిని కొనుగోలు చేశారు. దీనిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదనే క్రమబద్ధీకరణ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.


అయినప్పటికీ అధికారులు దాన్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి ఈ భూముల వ్యవహారంలో ప్రభాస్‌ హక్కుల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపింది. ఫలితంగా రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రభాస్‌కు హైకోర్టు ఊరట లభించింది. 
 
ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. భూ క్రమబద్దీకరణకు అతను దరఖాస్తు పెట్టుకుంటే, విస్తృత ప్రజాప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments