Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజా ''నేల టిక్కెట్'' ఆడియోకు పవన్ కల్యాణ్?

మాస్ మహారాజా వరుస పెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు అంటూ సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న రవితేజ.. తాజాగా నేల టిక్కెట్‌తో రెడీ అయిపోతున్నాడు. ఈ సిన

Webdunia
మంగళవారం, 1 మే 2018 (18:34 IST)
మాస్ మహారాజా వరుస పెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు అంటూ సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న రవితేజ.. తాజాగా నేల టిక్కెట్‌తో రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ కానుంది. నేలటిక్కెట్‌ను మే 24న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. 
 
సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌.. వేడుక చూద్దాం వంటి కుటుంబ కథా చిత్రాలతో మంచి విజయాలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీ మాళవిక శర్మ నటిస్తోంది. ఈలోగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారట. మెగా ఫ్యామిలీతో రవితేజకి గల సాన్నిహిత్యం కారణంగా పవన్ తప్పకుండా వస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ రాకతో ఈ సినిమాకు ఫోకస్ పెరుగుతుందని టాక్ వస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments