Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మొసలి'ని వేటాడేందుకు నీటిలోని 'చేప'లను చంపేస్తారా? నోట్ల రద్దుపై పరుచూరి గోపాలకృష్ణ నీతి కథ!

ప్రస్తుతం దేశంలో ప్రతిఒక్కరూ నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారు. నల్లధనం నిర్మూలన కోసం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న రాత్రి ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. ఆ రాత్రి మోడీ ప్రకటన

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (14:05 IST)
ప్రస్తుతం దేశంలో ప్రతిఒక్కరూ నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారు. నల్లధనం నిర్మూలన కోసం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న రాత్రి ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. ఆ రాత్రి మోడీ ప్రకటన విని సామాన్యులంతా హర్షించారు. మోడీ గ్రేట్ అంటూ ఆకాశానికెత్తేశారు. అయితే మూడురోజుల తర్వాత హర్షించినవారే విమర్శిస్తున్నారు. నోట్ల మార్పిడి కోసం గంటల తరబడి.. కాదు కాదు రోజుల తరబడి పనులన్నీ మానుకుని క్యూలైన్‌లో నిలబడే సరికి హర్షించిన వాళ్లే మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈపరిస్థితుల్లో తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నోట్లరద్దు నిర్ణయంపై ఓ నీతికథను వివరించారు. ఆ కథ ఉన్నది మూడు ముక్కలే అయినా... అందులో చాలా పరమార్థం దాగుంది. ఓ రైతును ఉదాహరణగా తీసుకుని రెండు లైన్ల నీతి వాక్యాన్ని రాశారు. ‘చెరువులో మొసలి ఉందని నీళ్లు మొత్తం తోడించేశాడు రైతు!. చేపలు చచ్చిపోయాయి!.. మొసలి పారిపోయింది. ఈ కథలో నీతి ఉంది కనిపెట్టండి.’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 
 
‘ఎవరో దొంగనోట్లు దాచుకున్నారని.. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే రైతులకెందుకీ కష్టం. కూలి పనికి పోనిదే పూట గడవని సామాన్యుడికెందుకీ కష్టం. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వాళ్లు ఏం పాపం చేశారు. నల్లధనాన్ని వెనకేసుకున్నారా? నిజంగానే నల్లధనాన్ని వెనకేసుకున్నవాళ్లు.. కనీసం ఒక్కరైనా ఇలాంటి కష్టాలు పడినట్లు ఎక్కడైనా వచ్చిందా? నల్లధనం అంటే ఏమిటో కూడా తెలియని గ్రామాల్లో నివసించే వృద్ధులు కూడా తామేదో తప్పు చేసినట్లు బ్యాంకుల ముందు పడిగాపులు కాయడమేంటి?’ అని ఈ కథలో ఉన్న నీతిని నెటిజన్లు కనిపెడుతున్నారు. ‘రైతు ఎర వేసి మొసలిని బయటకు రప్పించి చంపేసి ఉంటే చెరువులో చేపలు ప్రశాంతంగా జీవించి ఉండేవి’ అని పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments