Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ కోసం కదిలిన పవర్ స్టార్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:32 IST)
మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ ఈ నె 10వ తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుంది. అయితే, ఈ హీరో నటించిన "రిపబ్లిక్" మూవీ వచ్చే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హీరో లేకుండానే జరుగుతున్న కార్యక్రమం కావడంతో తమ మేనల్లుడి కోసం మెగా ఫ్యామిలీ అంతా కదలనుంది. 
 
అక్టోబరు ఒకటో తేదీని పురస్కరించుకుని హీరో లేకుండానే దర్శకనిర్మాతలు ప్రమోషన్ మొదలుపెట్టారు. అయితే, తన మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. పోస్టర్ కూడా విడుదల చేశారు. 
 
హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ వేడుక జరుగనుంది. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్న ఈ సమయంలో జరుగుతున్న ఈవెంట్ కావడంతో అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా సోషల్ మెసేజ్‌తో వస్తుంది. రమ్యకృష్ణ పవర్ లేడీ పొలిటీషియన్ పాత్రలో నటించగా, సాయిధరమ్ తేజ్ కలెక్టర్‌గా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించే భారత రైతులు నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments