Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాసాంధ్రులకు "అజ్ఞాతవాసి" సందేశం (వీడియో)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన రిలీజ్ కానుంది. ‘అత్తారింటికి దారేది’లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (15:07 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన రిలీజ్ కానుంది. ‘అత్తారింటికి దారేది’లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. 
 
ఈ చిత్రం జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం మనకంటే ముందే రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ విడుదలకు ఏర్పాట్లుచేశారు. తన సినిమాపై ఎంతో ప్రేమ, ఆదరణ కనబరుస్తున్న ప్రవాసీయులకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో... 
  
"ప్రవాసలో ఉన్న తెలుగు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉన్న ఊరిని వదిలి పక్క ఊరికి వెళ్లి పనిచేయడమే ఎంతో కష్టమో నాకు తెలుసు. అలాంటిది రాష్ట్రాన్ని వదిలి.. దేశాన్ని.. వదిలి దేశం కాని దేశంలో చదువుకోవడం.. అక్కడ ఉద్యోగం చేయడం ఇంకెంతో కష్టం. దాంతో పాటు ఆత్మ గౌరవం దెబ్బతినకుండా జీవితాన్ని ఏర్పరచుకోవడం, అక్కడ స్థానికతను సంపాదించుకోవడం ఎంత కష్టమో నాకు చాలా బాగా తెలుసు. అందుకే నాకు మీరంటే చాలా గౌరవం. మీరెక్కడున్నా.. మీ వెనుక మీతో పాటు మేమున్నాం. అక్కడ మీకు చిన్న సమస్య ఎదురైతే మీకు అండగా కోట్ల గొంతులు ఇక్కడ అండగా నిలబడతాయి.
 
సరిగ్గా 18 సంవత్సరాల క్రితం "బద్రీ" సినిమా అమెరికా దేశంలో విడుదలైనప్పుడు.. ఏవో కొద్దిపాటి సెంటర్లలో విడుదల అవగానే అది చాలా పెద్ద విజయంగా నాకు చెప్పారు. అలాంటిది ఈరోజు "అజ్ఞాతవాసి" సినిమా ఏ భారతీయ చలన చిత్రానికీ ఇవ్వనంత భారీ విడుదల ఇస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. మీరు చూపించే ఈ ప్రేమకు, గౌరవానికి శిరస్సు వంచి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా" అంటూ పవన్ కళ్యాణ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments