Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్దే అలా చేసినందుకే ఆఫర్లు వస్తున్నాయా?

సినిమా రంగంలో రోజురోజుకీ హీరోయిన్లు స్కిన్ షో చేయడం ఎక్కువైపోతోంది. గతంలో హీరోయిన్లు నిండుగా చీరలతో దర్శనమిచ్చేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. సినిమాలలో ప్రస్తుతం వారి పాత్ర నామమాత్రంగా మారింది, అంటే కేవలం స్కిన్ షోకి మాత్రమే వారు పరి

Webdunia
మంగళవారం, 29 మే 2018 (19:59 IST)
సినిమా రంగంలో రోజురోజుకీ హీరోయిన్లు స్కిన్ షో చేయడం ఎక్కువైపోతోంది. గతంలో హీరోయిన్లు నిండుగా చీరలతో దర్శనమిచ్చేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. సినిమాలలో ప్రస్తుతం వారి పాత్ర నామమాత్రంగా మారింది, అంటే కేవలం స్కిన్ షోకి మాత్రమే వారు పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంది హీరోయిన్ 'పూజా హెగ్దే'. మొదటి సినిమా ముకుందాలో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి, ఒక లైలా కోసం చిత్రంలో కొంత మోడ్రన్ అమ్మాయిలాగా దర్శనమిచ్చింది. తరువాత హిందీలో హృతిక్‌తో చేసిన మొహెంజోదారో సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో మరోసారి తెలుగులో బన్నీతో కలిసి డీజే సినిమాలో నటించింది. 
 
ఈ సినిమాలో ఆమె బికినీ వేసి పరిమితికి మించి స్కిన్ షో చేయడంతో యువతను ఆకట్టుకున్నప్పటికీ, అది సినిమా ఫలితంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక అవకాశాలు లేక విసిగిపోయిన ఈమె రామ్‌చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్‌లో సైతం జిగేలు రాణిగా చిందులు వేసింది. ఈ సినిమా కాస్త ఓ రేంజ్‌లో ఆడటంతో మరోసారి ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్-ఎన్టీయార్ 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో, అలాగే మహేష్-వంశీ పైడిపల్లి సినిమాలలో హీరోయిన్‌గా నటించే అవకాశం కొట్టేసింది. 
 
అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం అనే చిత్రంలో కూడా నటిస్తోంది. అందాల ఆరబోతకు తాను ఎప్పుడైనా సిద్ధమేనంటూ దర్శక నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నైజంతో ముందుకెళ్తోంది. ఈ ముద్దుగుమ్మకు మున్ముందు రాబోయే చిత్రాలు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయని ఆశగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments