Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌ చేయనంటున్న హీరోయిన్?

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (10:56 IST)
చాలామంది హీరోయిన్లు సినిమాల్లో వచ్చే ప్రత్యేక గీతాల్లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఐటెమ్ పాటలతోనే క్రేజ్ సంపాదించుకొని, లైఫ్‌లో సెటిల్ అయిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఓ సినిమా కోసం నాలుగైదు నెలలు కష్టపడితేరాని పారితోషికాలు, ప్రత్యేక గీతాలతో సంపాదించవచ్చు. అందుకే అగ్ర కథానాయికలు సైతం ఐటెమ్ పాటల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. 
 
పైగా, ఈ తరహా పాటలకు మంచి ఆదరణ ఉండటంతో దర్శక నిర్మాతలు సైతం తమ చిత్రాల్లో ఒక్క ఐటమ్ సాంగ్‌ను ఉంచేందుకు అమితాసక్తి చూపుతూ, ఈ పాటలను బడా హీరోయిన్లతో చేయిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే మాత్రం ఓ ఐటెమ్ గీతానికి 'నో' చెప్పిందని టాక్. 
 
ప్రిన్స్ మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గుంటూరు కారం'. ఇందులో ఓ ఐటెమ్ గీతం కోసం పూజాని సంప్రదిస్తే 'నో' చెప్పిందట. కథానాయికగా తనని తప్పించారన్న బాధతోనే పూజా ఇప్పుడు ఐటెమ్ గీతం చేయడం లేదని టాక్. 
 
ఇదివరకు 'రంగస్థలం'లో 'జిగేల్ రాణి'గా మెప్పించిన పూజా.. ఈసారి మహేశ్ సినిమాకి నో చెప్పడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. అయితే, దీనికి కారణం లేకపోలేదు. నిజానికి గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డేనే సంప్రదించారు. కానీ, కథా పరంగా ఆమెను కాకుండా మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. ఈ కోపంతోనే ఆమె ఇపుడు ప్రత్యేక గీతం చేయనని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments