Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు పోసాని కృష్ణమురళికి మళ్లీ కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (11:07 IST)
తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోమారు కరోనా వైరస్ సోకింది. ఆయన కరోనా వైరస్ బారినపడటం ఇది మూడోసారి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల పూణెలో జరిగిన షూటింగులో పాల్గొన్న పోసాని.. గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయనకు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గురువారం ఒక్కరోజే పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లే ప్రజలు విధిగా ముఖానికి మాస్కులు ధరించాలని పలు రాష్ట్రాల్లో సూచిస్తూ కరోనా నిబంధనలను కూడా సడలిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments