Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ ఎన్టీఆర్‌ అంతుతేల్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చెర్రీ?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్‌బస్టర్ హిట్ "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఈ స్ట

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (11:50 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్‌బస్టర్ హిట్ "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఈ స్టార్ హీరోల పాత్రల తీరుతెన్నులపై సోషల్ మీడియాలో వివిధ రకాలైన ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారనీ, ఆ గ్యాంగ్‌స్టర్ అంతుతేల్చే పాత్రలో చెర్రీ నటిస్తున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. నిజానికీ వీరిద్దరూ ఈ చిత్రంలో అన్నదమ్ములే. కానీ, వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు. ఈ పరిస్థితుల్లో చోటుచేసుకునే పరిణామాలతో కథ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని తెలుస్తోంది. 
 
కాగా, అక్టోబరు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం హీరోయిన్లు, ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments