Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ ఈగల్స్ టీమ్‌‌కు మెంటర్‌గా దర్శకధీరుడు

తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రీడకు సెలెబ్రిటీల ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. కబడ్డీని ప్రోత్సహించేందుకు వారు ముందుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రీడకు సెలెబ్రిటీల ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. కబడ్డీని ప్రోత్సహించేందుకు వారు ముందుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్ టీమ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ జట్టుకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ మొదలుకానుంది. ఈ టోర్నీలో రాజమౌళి కుమారుడు కార్తీకేయ నల్గొండ ఈగల్స్ టీమ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ జట్టుకు మెంటర్‌గా పనిచేయనున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఇప్పటికే రాజమౌళికి క్రీడలంటే ఇష్టం. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే రాజమౌళి.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు జక్కన్న మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో రాజమౌళి తనయుడు కబడ్డీ టీమ్‌ను ప్రజెంట్ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments