Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ ''మర్డర్'' నుంచి మరో పోస్టర్.. అమృత బాబుతో..?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (16:41 IST)
Murder
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా 'మారుతి రాసిన అమృతప్రణయ గాథ' అంటూ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు విడుదల చేసిన వర్మ శుక్రవారం ఈ చిత్రం నుంచి మరో పోస్టరును విడుదల చేశారు. ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేపేలా వర్మ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.
 
ఈ పోస్టర్‌లో అమృత  తన కుమారుడిని ఎత్తుకుని ఉన్నట్లు ఉంది. ప్రణయ్ పరువు హత్యకు గురికావడం, అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వంటి సన్నివేశాలతో యధార్థ కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ప్రయణ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేసిన మర్డర్ మూవీ ఫస్టు లుక్ పోస్టరుపై అమృత మండిపడింది. తన కథ పేరుతో రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ మూవీకి తన రియల్ లైఫ్‌కి ఏ సంబంధం లేదని అమృత స్పష్టం చేసింది. అయినా అమృత వ్యాఖ్యలను వర్మ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రస్తుతం మర్డర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. ఓటీటీలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments