Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తొలిప్రేమ' హీరోతో 'గీతగోవిందం' హీరోయిన్...

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (10:54 IST)
"ఛలో" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న. "గీతగోవిందం" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ ఒక్క చిత్రంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో రష్మికకు తెలుగులో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. 
 
అయితే, 'గీతగోవిందం' తర్వాత వచ్చిన దేవదాస్ చిత్రంలో నానికి జంటగా నటించింది. కానీ, ఈ చిత్రం నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ అమ్మడుకి ఆఫర్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు నిర్మాతలు క్యూకడుతున్నారు. అయితే, దీంతో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక.. తనకు కథ నచ్చితేనే నటిస్తానంటూ నిర్మాతలకు తెగేసి చెబుతోంది. 
 
ఈనేపథ్యంలో రష్మిక మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. 'ఫిదా', 'తొలిప్రేమ'తో విజయాలు అందుకున్న వరుణ్‌తేజ్‌తో రొమాన్స్ చేసేందుకు రష్మిక సిద్ధమవుతోంది. సిద్దార్ధ, లక్ష్మీమీనన్ జంటగా 2016లో వచ్చిన తమిళ చిత్రం 'జిగర్‌తండ'ను హరీష్ శంకర్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రష్మిక ఆడపాడనుంది. రష్మిక ప్రస్తుతం విజయ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది.
 
సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌తో మొదలై గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. తొలి చిత్రం 'పిజ్జా'తో తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం అందుకున్న కార్తీక్ సుబ్బరాజు 'జిగర్‌తండ'కు దర్శకత్వం వహించారు. 
 
అయితే ఈ సినిమా తెలుగులో 'చిక్కడు దొరకడు' పేరుతో గతంలోనే డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా థియేటర్లకు ఎప్పడొచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ తెలీదు. ఇలాంటి చిత్రాన్ని హరీష్ శంకర్ రీమేక్ చేయాలనుకోవడం సాహసమే అని చెప్పాలి. అసలే ప్లాపులతో సతమతమవుతున్న ఈ 'గబ్బర్‌సింగ్' డైరెక్టర్ ఎంత మేరకు సఫలమవుతాడో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments