Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చచ్చినా పులుపు చావలేదు.. చుక్కల్లో రవితేజ రెమ్యునరేషన్

'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్నది ఓ నానుడి. దీన్ని రుజువు చేసేలా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నడుచుకుంటున్నారట.

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (16:16 IST)
'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్నది ఓ నానుడి. దీన్ని రుజువు చేసేలా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నడుచుకుంటున్నారట. ముఖ్యంగా సినీ అవకాశాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ... రెమ్యునరేషన్ విషయంలో విషయంలో ఈ మాస్ మహారాజా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. దీంతో దర్శకనిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారట. 
 
రెండేళ్ల గ్యాప్‌తో రవితేజ చేసిన "రాజా ది గ్రేట్" హిట్ టాక్ సొంతం చేసుకోగా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు బ్రేక్ ఈవెన్ రాలేదని అంటున్నారు. అయితే ఓవరాల్‌గా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. "బెంగాల్ టైగర్" తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా మాస్ రాజా క్రేజ్ మరింత పెంచేసింది. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచాడట. తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు రూ.10 కోట్లు ఇస్తేనే సినిమా అంటున్నాడట రవితేజ.
 
రవితేజకు అన్ని కోట్లు అంటే సినిమా బడ్జెట్ ఎంతలేదన్నా రూ.30 కోట్లకు చేరుకుంటుంది. ఆ చిత్రానికి హిట్ టాక్ వస్తేనే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. లేదంటే నిర్మాతతో పాటు పంపిణీదారులు కూడా నష్టాలను చవిచూడాల్సిందే. కానీ, తన రెమ్యునరేషన్ విషయంలో రవితేజ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. అందుకే పలు ఆఫర్లను కూడా కోల్పోతున్నాడట. మొత్తానికి రవితేజ రెమ్యునరేషన్ షాక్‌తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments