Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ, రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పైన ఫేస్ బుక్ లో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇటీవల రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా వున్నప్పుడు పిల్లల్ని చూసుకునేందుకు ఓ వ్యక్తి వుంటే బాగుండునని చెప్పింది. దీనిపై పవన్ ఫ్యా

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (21:34 IST)
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పైన ఫేస్ బుక్ లో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇటీవల రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా వున్నప్పుడు పిల్లల్ని చూసుకునేందుకు ఓ వ్యక్తి వుంటే బాగుండునని చెప్పింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఫేస్ బుక్‌లో కామెంట్లు చేస్తున్నారు. 
 
ఓ అభిమాని ఇలా రాశాడు...  ‘మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఐ హేట్ యూ... మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చ‌చ్చినంత ఒట్టు. రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌర‌వం పోతుంది. ప‌వ‌న్ కల్యాణ్‌ని మేమంతా అన్నా అని పిలుస్తాం, మిమ్నల్ని వ‌దిన అంటాం. మీ నిర్ణ‌యంతో అంద‌రూ బాధప‌డే అవ‌కాశం ఉంది.’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇంకా ఇలాంటి పోస్టులు గంటగంటకూ పడుతూనే వున్నాయి. 
 
ఇటీవ‌ల రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించినట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆమె వ్య‌క్తిగ‌త విష‌యంలో క‌ల‌గజేసుకుని ఇలా కామెంట్లు చేస్తున్నారు. వీటిపై రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఇలా కామెంట్లు చేసేవారు కేవలం తనను గురించి మాత్రమే చేస్తున్నారని తను భావించడంలేదనీ, ఈ కామెంట్లను చూస్తుంటే 'ఎలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య బతుకుతున్నాం?' అనే భావన కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ మరో పోస్టు చేసింది. మహిళల సమానత్వం అంటూనే కొందరు మగాళ్లు ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏడేళ్లు ఒంటరిగా ఉన్నాననీ, తనకు ఇప్పుడు ఒక జీవితభాగస్వామి ఉంటే బాగుండుననిపించడం తప్పా అంటూ ప్రశ్నించింది. జీవితాంతం తను తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా? అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments