Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆద్య''గా రానున్న రేణు దేశాయ్.. వెబ్‌సిరీస్‌లో నటించనున్న బద్రి హీరోయిన్

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:08 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ త్వరలో వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. రేణుదేశాయ్ బద్రి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే... పవన్‌తో జానీ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. దర్శకురాలిగా మారి ఇష్క్ వాలా లవ్ అనే సినిమా రూపొందించారు. 
 
ప్రస్తుతం నటిగా కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత నటిగా కొత్త జర్నీ స్టార్ట్ చేయనున్నారు. ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కి కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను డీ.ఎస్.రావు, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
సత్యాన్వేషణలో.. ఒక మహిళ ప్రయాణం ఎలా ఉంటుంది..? ఈ వెబ్ సిరీస్ స్టోరీ అని తెలిసింది. ఇందులో ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈఓగా కనిపించనున్నారట. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ టైటిల్ ఆద్య అని టాక్ వినిపిస్తోంది. 
 
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ల కుమార్తె పేరు ఆద్య. అందుకనే ఈ వెబ్ సిరీస్‌కి ఆ టైటిల్ ఖరారు చేశారట. టైటిల్ బయటకు రావడంతో అందరకీ ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి కలుగుతుంది. త్వరలో ఈ వెబ్‌సిరీస్‌పై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments