Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను : రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (10:32 IST)
రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. అభిషేక్ నామా నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రీలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించిన నటి రేణూ దేశాయ్ కూడా పాల్గొని ప్రసంగించారు. 
 
తాను ఇండస్ట్రీకి వచ్చి 23 యేళ్లు అయింది. అయినా తాను నటించిన "బద్రీ" చిత్రం ఇటీవలే విడుదలైందనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంతకాలంగా తాను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూ వచ్చారు.. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. 
 
అలాగే, ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదలు. హీరో రవితేజ వంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా.. పర్సనల్ గాను రవితేజకు థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని రేణూ దేశాయ్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments