Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌, ధోనీ రికార్డుల్ని బ్రేక్ చేశాడు.. రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:35 IST)
భారత్-వెస్టిండీస్‌ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేశాడు. భారత జట్టుకు భారీ స్కోర్ నమోదు చేసుకునే విధంగా ధీటుగా ఆడాడు. మొదటి నుంచే ఆచితూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతూ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రెండూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌వే కావడం విశేషం. 
 
అవేంటంటే.. సిక్సర్ల విషయంలోనూ రోహిత్ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. వన్డేల్లో సచిన్‌ పేరిట వున్న 195 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచిన రోహిత్ ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది సచిర్ రికార్డును బద్దలుగొట్టాడు. 
 
అలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఓ వైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా భారత ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ సెంచరీ సాధించాడు. దీంతో తన కెరీర్లో 21వ సెంచరీ  పూర్తిచేసుకున్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది 19వ సెంచరీ. కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్సుల్లో శతకాన్ని సాధించాడు. 
 
అతడి కంటే వేగంగా 19 సెంచరీలు సాధించి రోహిత్ ఆ రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 19 సెంచరీలు సాధించిన భారత బ్యాట్ మెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇలా ఓపెనర్‌గా అత్యధిక శతకాలు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు 102 ఇన్నింగ్సుల్లోనే 19 సెంచరీలు పూర్తిచేసుకున్నాడు. ఆమ్లా తర్వాతి రెండో స్థానంలో రోహిత్ నిలిచాడు. 
 
మొత్తంగా భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్‌మెన్స్ జాబితాలో ఎంఎస్ ధోని (211 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా రోహిత్ 198 సిక్సర్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments