Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తట్టుకోలేక వీరాభిమాని ఆత్మహత్య

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (14:47 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం ఎందరినో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే సుశాంత్ ఇలా హఠాన్మరణం చెందడంతో తట్టుకోలేకపోయిన ఆయన వదిన నిద్రాహారాలు మానడంతో అనారోగ్యానికి గురై కన్నుమూశారు. తాజాగా తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నందుకు ఎంతగానో కలత చెందిన సుశాంత్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన వ్యక్తి సుశాంత్‌కి వీరాభిమాని. పదవ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి సుశాంత్‌ని ఎంతగానో ఆరాధిస్తాడు. తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమాని కూడా సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లెటర్‌లో నా హీరో ఆత్మహత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా అంటూ రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. 
 
మరోవైపు, సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్‌తో ముంబై పోలీసులు మాట్లాడారు. పలు విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. ఈ సదంర్భంగా కేకే సింగ్ మాట్లాడుతూ, సుశాంత్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు తనకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ తెలియదని చెప్పారు. తన కుమారుడు ఏ కారణంతో ఒత్తిడికి గురయ్యాడో తెలియదని చెప్పారు. సుశాంత్ మరణం విషయంలో తాము ఎవరినీ అనుమానించడం లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments