Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరా జాస్మిన్ స్థానంలో కీర్తి సురేష్.. పందెంకోడి-2.. హిట్ ఖాయమా?

''మహానటి'' సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు ప్రస్తుతం ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. మహానటికి ముందే అగ్రహీరోలతో కోలీవుడ్‌లో అదరగొట్టిన కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో మాత్రం మహానటికి తర్వాత సినీ అవకాశాల

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (18:29 IST)
''మహానటి'' సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు ప్రస్తుతం ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. మహానటికి ముందే అగ్రహీరోలతో కోలీవుడ్‌లో అదరగొట్టిన కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో మాత్రం మహానటికి తర్వాత సినీ అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్ సరసన సామి-2 ( (సామి స్క్వేర్)లో నటిస్తున్న ఈ చిన్నది.. తెలుగులోనూ, తమిళంలోనూ మాస్ హీరోగా క్రేజున్న విశాల్‌ సరసన నటిస్తోంది. 
 
ఇటీవల ఇరుంబు తిరై తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. తెలుగులో అభిమన్యుడు పేరుతో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి తర్వాత విశాల్ పందెంకోడి-2 (తమిళంలో సండైకోళి-2) సినీ షూటింగ్‌లో బిజీబిజీగా వున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన పందెం కోడికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌. 
 
ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలు ముగించుకుని దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తమిళనాట దీపావళికి సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అయినా పోటీని లెక్కచేయకుండా విశాల్ పందెం కోడి సీక్వెల్‌ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 
 
ఇక పందెం కోడి-1లో మీరా జాస్మిన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో ప్రస్తుతం కీర్తి సురేష్ నటించనుందని.. విశాల్, కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందని సినీ పండితులు చెప్తున్నారు. దీంతో సినిమా హిట్ కావడం ఖాయమని వారు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments