Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి శతమానం భవతి.. శర్వానంద్ 25 సినిమా.. హిట్టేనా?

పల్లెటూరి కథా నేపథ్యంలో, అందమైన కుటుంబ కథా చిత్రంగా శతమానం భవతి తెరకెక్కుతోంది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (09:20 IST)
పల్లెటూరి కథా నేపథ్యంలో, అందమైన కుటుంబ కథా చిత్రంగా శతమానం భవతి తెరకెక్కుతోంది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంలో సాగే మూడు తరాల కథ ఇది. తాతా మనవళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. కలిసి ఉంటే కలదుసుఖమని నమ్మే ఓ కుటుంబం కథతో అర్థవంతంగా సాగేచిత్రమిదన్నారు. 
 
ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని దర్శకుడు సతీష్ సినిమాలో హృద్యంగా ఆవిష్కరించారు. పల్లెటూరి మధురజ్ఞాపకాల్ని ప్రతి ఒక్కరికి గుర్తుకుతెస్తుంది. మిక్కీ.జే.మేయర్ స్వరాలకు చక్కటి స్పందన లభిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రమిదని వెల్లడించారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments