Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అలా.. వైకుంఠపురం' నటుడు ఉపేంద్రపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (10:47 IST)
అల్లు అర్జున్ 'అలా.. వైకుంఠపురం'లో నటించిన కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదు అయ్యింది.
 
'ప్రజాకీయా' వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర శనివారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌ నిర్వహించారు. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ ఆదివారం బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్‌ బెంగళూరు డీసీపీ కృష్ణకాంత్‌ తెలిపారు.
 
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్‌ వీడియోను సైతం తన సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. 'ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యల కారణంగా కొంతమంది ఇబ్బందిపడ్డారని గ్రహించిన వెంటనే లైవ్‌ వీడియోను తొలగించాను. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించండి' అంటూ ఆయన పోస్ట్‌ పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments