Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానుభావుడు''తో షాలినీ పాండే.. శర్వానంద్ ద్విపాత్రాభినయం..

''మహానుభావుడు''తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ.. అదే హీరో శర్వానంద్‌తో కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తొలిసార

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:59 IST)
''మహానుభావుడు''తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ.. అదే హీరో శర్వానంద్‌తో కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నివేదా థామస్ ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో హీరోయిన్‌గా షాలినీ పాండేను తీసుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే మంచి క్రేజ్ కొట్టేసింది. 
 
ప్రస్తుతం తెలుగులో మహానటి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా తమిళంలో రీమేక్ అవుతున్న ''100% లవ్" తమిళ రీమేక్‌లోనూ నటిస్తోంది. తాజాగా శర్వానంద్ సినిమాలోనూ అవకాశం కొట్టేసింది. కాగా సుధీర్ వర్మ, శర్వానంద్, నివేదా థామస్, షాలినీ పాండే కాంబోలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments