Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం తెల్లారే చితక్కొట్టాడు... గాయని కౌసల్య

పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదనీ తన తల్లిని నిందిస్తుంటే తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే తన భర్త శోభనం రోజు మరుసటి రోజే కొట్టాడని ఆ సంఘటన ఇప్పటికీ బాధగా మిగిలిపోయిందని సినీ గాయన

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (11:23 IST)
పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదనీ తన తల్లిని నిందిస్తుంటే తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే తన భర్త శోభనం రోజు మరుసటి రోజే కొట్టాడని ఆ సంఘటన ఇప్పటికీ బాధగా మిగిలిపోయిందని సినీ గాయని కౌసల్య చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తాను, వివాహమైన తొలి నాళ్లలోనే గృహ హింసను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది. 
 
తాజాగా ఆమె ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను ఎదుర్కొన్న గృహహింసను పూసగుచ్చినట్టు వివరించింది. పెళ్లిలో తమకు మర్యాదలు సరిగ్గా చేయలేదని గొడవకు దిగగా, తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే కొట్టాడని, ఆ దెబ్బ ప్రభావం ఏళ్లు గడిచినా తనపై ఇంకా ఉందని చెప్పింది. అప్పుడే చనిపోవాలని, విడాకులు తీసుకోవాలని అనుకున్నానని, అయితే, చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, కష్టపడి పెంచిన తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెలు, సొసైటీ గురించిన ఆలోచన వచ్చి ఆగిపోయానని తెలిపింది. 
 
ఆ తర్వాత బాబు పుట్టిన ఆరేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందని, 'సూపర్ సింగర్ 7' జరుగుతున్న వేళ, సమస్యను పరిష్కరించేందుకు తన బావ వచ్చిన వేళ, వాళ్ల ముందు తనను రక్తం కారేలా కొట్టాడని, ఆ సమయంలో బాబు వచ్చి, "అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్‌ కొట్టొద్దు నాన్నా" అని వేడుకుంటుంటే హృదయం బాధతో ద్రవించిపోయిందని చెప్పింది.
 
భరించడానికి కూడా ఓ హద్దు ఉంటుందని, భర్త మారతాడని ఏళ్ల తరబడి ఎదురు చూశానని, కానీ తన ఆశ తీరలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కొడుకును చూసుకుంటూ ఆనందంగా ఉన్నానని, ఎవరి హక్కులను వారే కాపాడుకుంటూ ముందుకు సాగాలని నిశ్చయించుకుని జీవితాన్ని సాగిస్తున్నానని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments