బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (11:49 IST)
తన సహచరుడు, సినీ నేపథ్యగాయని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమైన తర్వాత అంతా చీకటిమయమైపోయిందని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, అటు ఘంటసాలగారితోనూ, ఇటు బాలుగారితోనూ కలిసి నేను పాటలు పాడాను. అలా పవిత్రమైన పాటలను, హుషారైన పాటలను పాడే అవకాశం నాకు లభించింది. ఘంటసాలగారు పాడితే ఎన్టీఆర్ గారికి, ఏఎన్నార్‌‍ గారికి సరిగ్గా సరిపోయేది. ఆ తర్వాత బాలుగారు కూడా అలాగే మెప్పించారు. బాలుగారూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. చివరి నిమిషం వరకూ పాటల పట్ల తన ప్రమేను కనబరుస్తూనే ఉన్నారు. ఆయన పోయిన తరువాత అంతా చీకటిమైపోయింది అన్నారు.
 
అప్పట్లో గాయనీగాయకులు, ఆర్టిస్టులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. సింగర్స్ కొన్ని పదాలను ఎలా పలుకుతున్నారు. వారి భావభావాలు అక్కడ అవసరమవుతుంది అనేది తెలుసుకోవడానికి అప్పుడపుడు సావిత్రి గారు, జమునగారు రికార్డింగ్ థియేటర్‌కి వచ్చేశారు. "భక్తప్రహ్లాద" సినిమాలో నేనూ రోజా రమణికి పాడుతుంటే ఆ పాపను తీసుకొచ్చి, రికార్డింగ్ థియేటర్‌ కూర్చోబెట్టేవారు. అంతటి అంకితభావం ఆ రోజుల్లో ఉండేది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments